Home / MOVIES / పవన్ తో నిత్యామీనన్ రోమాన్స్

పవన్ తో నిత్యామీనన్ రోమాన్స్

మలయాళ సూపర్‌హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ చిత్రం తెలుగులో రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే! పవన్‌కల్యాణ్‌, రానా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సాగర్‌.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాటలు, స్ర్కీన్‌ప్లే అందిస్తున్నారు. ఇందులో పవన్‌కి జోడీగా మొదటి నుంచి సాయి పల్లవి పేరు వినిపించింది. ఆమె తిరస్కరించడంతో ఆ అవకాశం ఇప్పుడు నిత్యామీనన్‌కి దక్కిందని, దాదాపు నిత్యామీనన్‌ కథానాయికగా ఖరారైనట్లు చిత్ర వర్గాల నుంచి సమాచారం.

ఆమె ఇతర చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల ఇంకా ఈ సినిమా సెట్‌లో అడుగుపెట్టలేదట. ప్రస్తుతం కరోనా సెకెండ్‌ వేవ్‌ వల్ల షూటింగ్‌లు తాత్కాలికంగా ఆగిన సంగతి తెలిసిందే. పరస్థితులు సర్దుకున్నాక నిత్యామీనన్‌ సెట్‌లో అడుగుపెడతారట. రానాకు జోడీగా ఐశ్వర్యా రాజేశ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే! ఇప్పటికే చిత్రానికి సంబంధించిన 50 శాతం కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయినట్లు తెలిసింది.

కరోనా ఉదృతి తగ్గాక తాజా షెడ్యూల్‌ మొదలుపెడతారట. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల వకీల్‌సాబ్‌తో సూపర్‌హిట్‌ అందుకున్న పవన్‌కల్యాణ్‌ ‘హరిహర వీరమల్లు’, హరీశ్‌ శంకర్‌తో ఓ సినిమా, సురేందర్‌ రెడ్డితో ఓ సినిమా చేయబోతున్నారు. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat