తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నిక ఫలితాలు ఆదివారం ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి వెలువడుతున్నయి.ఉదయం నుండి జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియలో అధికార పార్టీ టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు అభ్యర్థి నోముల భగత్ ముందంజలో ఉన్నారు.
నోముల భగత్ కు తొలి రౌండ్లో 1,475 ఓట్లు, రెండో రౌండ్లో 2,216 ఓట్ల మెజార్టీ, మూడో రౌండ్లో 2,665 ఓట్ల మెజార్టీలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్యధిక ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్లో టీఆర్ఎసు 4,228 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి 2,753 ఓట్లు పోలయ్యాయి.
మరోవైపు సాగర్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మూడో రౌండ్లోనూ టీఆరెస్సే లీడ్లో ఉంది. 3వ రౌండ్ ముగిసే సరికి టీఆరెస్ అభ్యర్థి నోముల భగత్ 2665 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాగా.. మూడో రౌండ్లో టీఆరెస్కు 3421, కాంగ్రెస్కు 2882 ఓట్లు వచ్చాయి.