ఆ భార్యాభర్తలది ఏపీలోని ప్రకాశం జిల్లా.. నిరుపేద కుటుంబం.. అల్లారుముద్దుగా పెంచుకొంటున్న తమ కూతురికి వెన్నెముక సంబంధిత వ్యాధి రావటంతో హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానలో చేర్పించారు.. పరీక్షించిన డాక్టర్లు ఆపరేషన్ చేయించాలని చెప్పారు..
సర్జరీకి అవసరమయ్యే డబ్బులేక ఆ దంపతులు తమలో తామే కుమిలిపోయారు.. ఆ బాలిక చిమ్మల జ్ఞాపిక (11) దీనస్థితిని చూసిన కొందరు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ విషయం తెలుసుకొన్న ఎమ్మెల్సీ కవిత తక్షణమే స్పందించి ఆపరేషన్ చేయించారు.
సర్జరీ తర్వాత కూడా మెరుగైన వైద్యానికి చర్యలు తీసుకొన్నారు. పూర్తిగా కోలుకున్న జ్ఞాపిక మంగళవారం దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యింది. ఈ సందర్భంగా మానవత్వంతో స్పందించిన కవితకు బాలిక తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఆపదలో తమ బిడ్డకు వైద్యం చేయించారని, ఆమె రుణం తీర్చుకోలేమని పేర్కొన్నారు.