ట్విట్టర్ తన ఖాతాను సస్పెండ్ చేయడంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఫైరయ్యింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా ట్విట్టర్పై విమర్శలు గుప్పించింది. ట్విట్టర్ అమెరికా బుద్ధి చూపించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘నల్లజాతివారిని తెల్లవాళ్లు ఎప్పుడూ బానిసలుగానే భావిస్తారు. మనం ఏం మాట్లాడాలో కూడా వాళ్లే డిసైడ్ చేయాలనుకుంటారు. ట్విట్టర్ పోతే ఏంటీ.. నా గొంతు వినిపించేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి’ అని కంగన తెలిపింది.