ఆగం అయిన ఆదాబ్ హైదరాబాద్..తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటిపై ఇటివల ”జీఓయంఎస్ 67 ను ఉల్లంఘించిన పెద్ది సుదర్శన్ రెడ్డి ” అంటూ వచ్చిన కథనం తో పొరపాటు దొర్లినట్టు అదాబ్ హైదరాబాద్ పేపర్ యాజమాన్యం దృవీకరించింది.
.
వారి పేపర్ స్థానిక విలేకరి ఎమ్మెల్యే గారిని కుటుంబ సభ్యులను డబ్బులు అడగగా వారు ఇవ్వకపోవడంతో వారిని బ్లాక్ మెయిల్ చేసి ఈ ”అక్రమ నిర్మాణం” అని వార్త రాసినట్టు ఒప్పుకున్నాడు.. ఎమ్మెల్యే గారు సంవత్సరం క్రితమే ఇంటి నిర్మాణం కోసం గ్రామ పంచాయితీ నుండి అనుమతి పొందారు..ఇల్లు నిర్మాణం కూడా నిబందనలకు లోబడి జి ప్లేస్ గా నిర్మాణం జరిగింది..
సదరు విలేకరి బ్లాక్ మెయిల్ చేయడాన్ని ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి ఇలాంటి చీడ పురుగులు పత్రిక విలేకరులుగ ఉండ కూడదు అని దుయ్యబట్టారు
సదరు విలేకరి పై ఆదాబ్ హైదరాబాద్ వారు చర్యలు తీసుకోవడమే తరువాయి