ఈ ఏడాది ‘ఏ వన్ ఎక్స్ప్రెస్’, ‘చావు కబురు చల్లగా’ చిత్రాలతో విభిన్న పాత్రల్లో ప్రేక్షకుల ముందుకొచ్చారు కథానాయిక లావణ్యా త్రిపాఠి.
తాజాగా ఆమె ఓ తమిళ చిత్రం అంగీకరించారు. రవీంద్ర మాధవన్ దర్శకత్వంలో అథర్వ మురళీ కథానాయకుడుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఐఏఎస్కు ప్రిపేరవుతున్న యువతిగా లావణ్య కనిపించనున్నారు.
ఓ ముఠా చేతిలో కిడ్నాప్కు గురయిన కథానాయికను కాపాడే పోలీస్ అధికారిగా అథర్వ కనిపించనున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తానని రవీంద్ర మాధవన్ తెలిపారు.