దేశాన్ని కుదిపేస్తున్న కరోనా టైంలో సినీ తారలు ఆశించిన స్థాయిలో సేవా కార్యక్రమాలు చేపట్టడం లేదనే వాదనలు అర్థరహితమని మిల్కీ బ్యూటీ తమన్నా తెలిపింది.
‘సినిమా వాళ్లు దాతృత్వ కార్యక్రమాలు విరివిగా చేయడం లేదనే అపోహను సృష్టించారు. వాస్తవంగా చాలామంది. ప్రచారానికి దూరంగా సేవ చేస్తున్నారు.
వ్యక్తిగతంగా మాత్రం నేను ఛారిటీ అంశాల్లో ప్రచారానికి దూరంగా ఉంటాను. ఇలాంటి తప్పుడు ప్రచారంతో మాపై ఒత్తిడి పెరుగుతోంది’ అని తమన్నా చెప్పింది.