తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం కరీంనగర్ వెళ్టుండగా రోడ్డుపై పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తిని గమనించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వెంటనే తన వాహనం నుంచి దిగి జగిత్యాల ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు.
మెట్ పల్లి, కథలాపూర్, మేడిపల్లిలలో ఆదివారం పలు కార్యక్రమాలలో పాల్గొని కరీంనగర్ వెళ్తుండగా వినోద్ కుమార్ కు ఈ సంఘటన ఎదురైంది.
జగిత్యాల నుంచి కరీంనగర్ వెళ్తున్న దారిలో మల్యాల్ ఎక్స్ రోడ్ లో గాయాలతో పడిపోయి ఉన్న గుర్తు తెలియని వ్యక్తిని చూసి వెంటనే బోయినపల్లి వినోద్ కుమార్ వాహనాన్ని ఆపి ప్రత్యేక వాహనంలో జగిత్యాల ఆసుపత్రికి తరలించాను. పోలీసులను అప్రమత్తం చేశాను.
ఆసుపత్రికి తరలించే ముందు ఆ గుర్తు తెలియని వ్యక్తికి ప్రాథమిక చికిత్స అందించారు.
మానవత్వాన్ని చూపిన వినోద్ కుమార్ సేవల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.