Home / SLIDER / సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో నేడు మంత్రి కేటీఆర్‌ పర్యటన

సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో నేడు మంత్రి కేటీఆర్‌ పర్యటన

తెలంగాణలోని సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో మంగళవారం మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్‌ నుంచి ఆయన బయల్దేరి 3 గంటల వరకు సూర్యాపేటకు చేరుకొని కోర్టు కూడలిలో ఏర్పాటు చేసిన కల్నల్‌ సంతోష్‌ బాబు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

అనంతరం ఓల్డ్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో రోడ్డు విస్తరణ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. 3 గంటల 45 నిమిషాలకు నల్లగొండ జిల్లాలోని కేతేపల్లి మండలం భీమరం గ్రామంలో రైతు వేదిక, వైకుంఠధామం, హైస్కూల్‌ భవనాన్ని ఆయన ప్రారంభిస్తారు.

అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు నకిరేకల్‌కు చేరుకొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో స్థానిక మంత్రి జగదీష్‌ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat