Home / SLIDER / టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ నేత ముద్దసాని కశ్యప్‌రెడ్డి

టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ నేత ముద్దసాని కశ్యప్‌రెడ్డి

 హుజురాబాద్‌ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి ముద్దసాని దామోదర్‌ రెడ్డి కొడుకు కశ్యప్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రులు హరీశ్‌ రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌ సమక్షంలో పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్‌ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని కశ్యప్‌ రెడ్డి అన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతోందన్నారు. త్వరలో హుజురాబాద్‌లో జరిగే సభలో వందలాది మంది కాంగ్రెస్‌ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతారని చెప్పారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా విజయం కోసం అంకితభావంతో పనిచేస్తానని వివరించారు.

హుజురాబాద్‌ నియోజకవర్గ ప్రజలు సీఎం కేసీఆర్‌ వెంటే ఉన్నారని హరీశ్‌ రావు అన్నారు. ‘2001 నుంచి హుజురాబాద్‌ టీఆర్‌ఎస్‌కు కంచుకోట. హుజురాబాద్‌ ఎగిరేది గులాబీ జెండానే. కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తున్న పార్టీగా టిఆర్ఎస్ ను అక్కడి ప్రాంత ప్రజలు ఆదరించారని’ హరీశ్‌ రావు పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat