తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధిశాఖమంత్రి వర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ చేతుల మీదుగా హన్మకొండలోని కాకాజీ కాలనీలో GLS డెంటల్ ఆస్పత్రి ప్రారంభోత్సవం..హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ లో సామాన్య ప్రజలకు మెరుగైన దంతవైద్యం అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో GLS డెంటల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని Dr. శేషుకుమార్, Dr. రోహిణి దంపతులు స్థాపించారు.. హన్మకొండ లోని కాకాజీ కాలనీలో స్థాపించిన ఈ డెంటల్ ఆస్పత్రిని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖమంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకరరావు, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ చేతుల మీదుగా ప్రారంబించారు.. ఈ కార్యక్రమంలో వరంగల్ నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణితో పాటు, వరంగల్ తూర్పు MLA నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు…
ఉత్తర తెలంగాణలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో ఈ ఆస్పత్రిస్థాపించినట్లు తెలిపారు.. వరంగల్ నగర ప్రజలకు 9 డెంటల్ ఛైర్స్ కలిగి, జిర్కొనియా ల్యాబ్, CBCT సౌకర్యం కలిగిన ఏకైక దంత వైద్యశాలగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది..
సీఎం కేసీఆర్ సంకల్పంతో వరంగల్ హెల్త్ హబ్ గా రూపుదిద్దుకుంటున్న ప్రస్తుత తరుణంలో GLS వైద్యులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తేవడం పట్ల Dr, శేషు కుమార్,Dr. రోహిణి లను మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, చీఫ్ విప్, మేయర్ గుండు సుధారాణి, వరంగల్ తూర్పు MLA నన్నపునేని నరేందర్ అభినందించారు…