తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సి.కళ్యాణ్పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఫిలిం నగర్కు చెందిన గోపికృష్ణ అనే వ్యక్తి తన ఫిర్యాదులో అక్రమంగా తన భూమిలోకి ప్రవేశించి బెదిరిస్తున్నారని రాసారు.
దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో సి. కళ్యాణ్తో పాటు షారుప్, శ్రీకాంత్, తేజస్వీ అనే ముగ్గురు వ్యక్తుల పేర్లు కూడా ఉన్నాయి. వారు దౌర్జన్యం చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.