బల్దియా అధికారులపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ కౌన్సిల్ మీటింగ్ వర్చువల్గా చేయడం వెనుక దరుద్ధేశాలు ఏంటని ప్రశ్నించారు.
మీడియాని జీహెచ్ఎంసీలోకి ఎందుకు అనుమతించట్లేదని నిలదీశారు. మేయర్ని కలిసి మీడియాని లోపలికి అనుమతించాలని కోరినట్లు తెలిపారు. ‘‘తూతూ మంత్రంగా.. టుత్ పాలిష్లాగా …హైదరాబాద్ని చెత్త నగరంగా చేస్తున్నారు’’ అని మండిపడ్డారు.
16 పట్టణాల్లో నివాసాయిగ్యమైన ప్రాంతాల్లో హైదరాబాద్ లేదన్నారు. చెత్త నగరంగా హైదరాబాద్ని తయారు చేశారని విమర్శించారు. దేశ వ్యాప్తంగా ఉన్న మెట్రో సిటీస్లో హైదరాబాద్కు స్థానం లేదని తెలిపారు. మూసీలో మంత్రి కేటీఆర్ నాలుగు గంటలు నిలబడితే అసలు సమస్యలు తెలుస్తాయని… త్వరలో ఆ రోజు వస్తుందని రేవంత్రెడ్డి అన్నారు.