కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ 128 డివిజన్ పరిధిలోని ఓల్డ్ చింతల్ లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమానికి ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ రషీదా మహ్మద్ రఫీ గారితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం పారిశుధ్య నిర్వహణలో భాగంగా పేరుకుపోయిన చెత్తా చెదారంను తొలగించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రతి కాలనీలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించే విధంగా ప్రజలు పట్టణ ప్రగతి కార్యక్రమానికి సహకరించాలని పిలుపునిచ్చారు. అలాగే అంటువ్యాధులు రాకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డిసి రవీందర్ కుమార్, ఈఈ కృష్ణ చైతన్య, డివిజన్ అధ్యక్షుడు మహ్మద్ రఫీ, డిఈ రామరాజు, ఏఈ సంపత్, ఈఎస్ సౌజన్య, ఎస్ఎస్ దుర్గారావు, పోతా రెడ్డి, జిలాని, ఎస్ఎఫ్ఏలు శామ్, వెంకటేష్, సాయి, జీవన్, రామకృష్ణ, సంక్షేమ సంగం అధ్యక్షులు రవి, లక్ష్మణ్ యాదవ్, మురళి, గంగన్న, వసంత, మల్లప్ప, గోపాల్ రెడ్డి, సూర్య చందర్రావు, శ్రీనివాస్ రెడ్డి, వరద రాజు, మధు, బాలమణి, జీవయ్య తదితరులు పాల్గొన్నారు.