కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 6, 10, 12, 13వ వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమానికి ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ గారితో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో ప్రజలు తప్పక మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించినప్పుడే హరితహారం లక్ష్యం నెరవేరుతుందని అన్నారు.
ప్రతి ఒక్కరూ ఇంటికి ఆరు చొప్పున మొక్కలు నాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ రఘు, వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, కౌన్సిలర్లు వసంత లక్ష్మణ్ గౌడ్, కృష్ణ వేణి వినోద్, సన్న రవి యాదవ్, శిరీష ప్రవీణ్, కుమార్ గౌడ్, సంజు యాదవ్, డప్పు కిరణ్ కుమార్, మాజీ ఎంపిపి సన్న కవిత శ్రీశైలం యాదవ్, మాజీ సర్పంచ్ జిమ్మి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.