Home / SLIDER / మత్స్యకారులందరికీ బీమా ధీమా

మత్స్యకారులందరికీ బీమా ధీమా

మత్స్య సహాకారం సంఘాల్లో నమోదైన సభ్యులందరికీ ప్రమాద బీమా పథకం వర్తింప జేయనున్నట్టు మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. ఇందుకు సంబంధించి మత్స్యకారులు చెల్లించాల్సిన ప్రీమియ మొత్తాన్ని వారి తరఫున ప్రభుత్వమే చెల్లిస్తదని స్పష్టంచేశారు. మరణించిన మత్స్యకార కుటుంబాలకు శనివారం హైదరాబాద్‌ హరిత ప్లాజాలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఇన్సూరెన్స్‌ చెక్కులను అందజేశారు.

మొత్తం 105 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని తెలిపారు. ఇందులో భాగంగానే మత్స్యకారుల కోసం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని అమలు చేయడంతోపాటు సబ్సిడీలో మోటార్‌ సైకిళ్లు, ఆటోలు, మొబైల్‌ ఫిష్‌ ఔట్‌లెట్స్‌ అందిస్తున్నట్టు చెప్పారు.

2021-22 సంవత్సరానికి మత్స్యకారులకు బీమా కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.97.58 లక్షల ప్రీమియం చెల్లించిందని, ఈ పథకంలో 3,36,799 మందిని అర్హులుగా గుర్తించినట్టు వివరించారు. కార్యక్రమంలో ఎంపీ బండా ప్రకాశ్‌, పశుసంవర్ధకశాఖ కార్యదర్శి అనిత రాజేం ద్ర, మత్స్యశాఖ కమిషనర్‌ లచ్చిరాం భూక్యా పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat