టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సమక్షంలో టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎలగందుల రమణ శుక్రవారం టీఆర్ఎస్లో లాంఛనంగా చేరనున్నారు. మధ్యాహ్నం 2 గంటల కు తెలంగాణభవన్లో నిర్వహించనున్న సభలో సీఎం కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి ప్రసంగిస్తారు.
ఈ నెల 8న సీఎం కేసీఆర్తో సమావేశమైన అనంతరం రమణ టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ఈ నెల 12న పార్టీ సభ్యత్వం స్వీకరించారు.
ఈ నేపథ్యంలో ఎల్ రమ ణ శుక్రవారం ఉదయం నారాయణగూడలోని పద్మశాలిభవన్ నుంచి తన అనుచరులు, ఇతర నాయకులతో కలిసి గన్పార్క్కు వెళ్తారు. అక్కడ తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించి, అక్కడి నుంచి తెలంగాణభవన్కు చేరుకుంటారు. మధ్యాహ్నం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ఆయన చెప్పారు.