టీఎస్ఆర్టీసీ కార్గో సేవలను మరింత విస్తరిస్తున్నది. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి నేరుగా ఏపీలోని విశాఖపట్నం వరకు సేవలను గురువారం ప్రారంభించింది. హైదరాబాద్లో బయలుదేరే కార్గో వాహనాలు కనెక్టెడ్ పాయింట్లు కోదాడ, సూర్యాపేట, విజయవాడ, రాజమండ్రి, అన్నవరం, తుని మీదుగా విశాఖపట్నం చేరుకుంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
10 టన్నుల సామర్థ్యం కలిగిన ఈ కార్గో వాహనాలు పటాన్చెరు, మెహిదీపట్నం, లక్డీకాపూల్, సీబీఎస్ నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపారు. వినియోగదారులు తమ వస్తువులను ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ర్టానికి టీఎస్ఆర్టీసీ కార్గోలో పంపేలా ఏర్పాట్లుచేసినట్టు చెప్పారు.
ప్రైవేటుతో పోలిస్తే టీఎస్ఆర్టీసీ కార్గో చార్జీలు తక్కువని, వినియోగదారులు తమ సేవలు వినియోగించుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని అధికారులు పేర్కొన్నారు.