Home / NATIONAL / దేశంలో 38,079 కరోనా కేసులు

దేశంలో 38,079 కరోనా కేసులు

దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 38,079 మంది కొత్తగా కరోనా బారినపడ్డారు. మరో 560 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసులు 3.10 కోట్లకు చేరింది.

ఇందులో 4,24,025 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 4,13,091 మంది మరణించారు. ఇప్పటివరకు 3.02 కోట్ల మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, గత 24 గంటల్లో కొత్తగా మరో 43 మంది మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని ఆరోగ్య శాఖ తెలిపింది.

పాజిటివిటీ రేటు 1.91 శాతం, రికవరీ రేటు 97.31 శాతంగా ఉందని ప్రకటించింది. అదేవిధంగా ఇప్పటివరకు 39.96 కోట్లకు పైగా టీకాల డోసులు పంపిణీ చేశామని వెల్లడించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat