తెలంగాణ మంత్రి కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని..కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు.. కూకట్పల్లి టిఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ సతీష్ అరోరా ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు… ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ..mlc నవీన్ కుమార్ హాజరయ్యి ప్రారంభించడం జరిగింది..
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో కరోనా వైరస్ విజృంభించి ఆక్సిజన్ మరియు రక్తం దొరకక చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందని .. భవిష్యత్తు తరాల దృష్ట్యా ప్రతి ఒక్కరు ఆరోగ్యంతో జీవించాలనే ఉద్దేశంతో మంత్రి కేటీఆర్ ఆయన జన్మదినం సందర్భంగా ఈ విధంగా మొక్కలు నాటడం మరియు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఎంతో అభినందించదగ్గ విషయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు…
అలాగే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మాట్లాడుతూ.. ప్రకృతిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ నేపథ్యంలోనే కూకట్పల్లి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి కార్యకర్త మూడు మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకున్నారని… కేవలం మొక్కలు నాటి వదిలితే సరిపోదని ..వాటి సంరక్షణ కూడా మన బాధ్యతని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు.. మందడి శ్రీనివాసరావు పగుడాల శిరీష బాబురావు జిహెచ్ఎంసి అధికారులు పాల్గొన్నారు…