ములుగు జిల్లా పాలంపేటలో చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని వారసత్వ కట్టడంగా (వరల్డ్ హెరిటేజ్ సైట్) యునెస్కొ గుర్తించింది..అత్యంత సృజనాత్మకంగా,శిల్ప కళా నైపుణ్యంతో తెలంగాణ లో సృష్టించిన ఆద్యాత్మిక ,సాంస్కృతిక సంపద దేశంలోనే ప్రత్యేకమైనది..ఇది యునెస్కో లో చేరటం మరింత అభివృద్దికి దోహదపడుతుంది..
ఎమ్మెల్సీ ,టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రామప్ప అభివృద్దిపై నిర్విరామ కృషి చేసారు..గత ఏడేండ్లుగా నిత్యం రామప్పను సందర్శిస్తూ అందుకు సంబందించిన ప్రతినిదులను తీసుకువస్తూ రామప్ప చరిత్రను వారికి వివరించారు..రామప్ప అభివృద్దిపై కౌన్సిల్ లో సైతం చర్చించారు.యునెస్కో ప్రతినిదులు హాజరైన సందర్బంగా రామప్ప శిల్పాల ప్రత్యేకతను,రామప్ప గొప్పదనాన్ని ఆయన వారికి వివరించారు.రామప్ప అభివృద్దిపై గౌ.ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కే.టీ.ఆర్ గార్ల దృష్టికి తీసుకువెల్లారు..
కాకతీయుల కళా వైభవం గురించి కేంద్ర పర్యాటక శాఖా మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ను స్వయంగా కలిసి రామప్ప మరియు వరంగల్ పర్యాటక ప్రాంతాల అభివృద్దిపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వినతి పత్రం,పలుమార్లు వారికి లేఖ సైతం రాసారు.
ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ ల నాయకత్వంలో,వారి మార్గనిర్దేశనంలో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారిక కృషితో నేడు రామప్పను యునెస్కో గుర్తించడం శుభ పరిణామం..రాబోవు రోజుల్లో రామప్ప ప్రపంచ పర్యాటక ప్రాంతాలకు దీటుగా అద్బుతంగా అభివృద్ది చెందుతుంది అనటంలో సందేహం లేదు.రామప్ప అభివృద్దికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు చేసిన కృషి అభినందనీయం..