Home / SLIDER / ప్రగతిభవనానికి బయలుదేరిన దళిత బంధువులు

ప్రగతిభవనానికి బయలుదేరిన దళిత బంధువులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న దళితబంధు పథకానికి సంబంధించిన అవగాహన సదస్సు నేడు జరగనుంది. ప్రగతిభవన్‌ వేదికగా జరిగే ఈ సదస్సు కోసం దళితబంధువులు హుజూరాబాద్‌ నుంచి బయలుదేరారు. ఎంపిక చేసిన 427 మందితో 16 బస్సులు హుజూరాబాద్‌ నుంచి పయణమయ్యాయి. ఈ బస్సులకు కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండా శ్రీనివాస్‌ పాల్గొన్నారు. పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణ, సాధించే లక్ష్యాలపై తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన అవగాహన సదస్సు జరుగనున్నది. సోమవారం ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభంకానుంది.

ప్రగతిభవనానికి బయలుదేరిన దళిత బంధువులు
రోజంతా జరుగనున్న ఈ భేటీలో హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి, జమ్మికుంట, హుజూరాబాద్‌ మున్సిపాలిటీల్లోని ఒకో వార్డు నుంచి నలుగురు చొప్పున (ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు) 412 మంది పురుషులు, మహిళలు, 15 మంది రిసోర్స్‌ పర్సన్స్‌.. మొత్తం 427 మంది దళితులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

ఈ సమావేశంలో.. దళితబంధు పథక ముఖ్య ఉద్దేశం, పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణతోపాటు పథకాన్ని విజయవంతం చేయటానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం వారికి అవగాహన కల్పిస్తారు. దళితబంధు రాష్ట్రంలోని దళితులందరి జీవితాల్లో గుణాత్మక మార్పుకు ఏవిధంగా దోహదపడుతుంది? పైలట్‌ ప్రాజెక్టును హుజూరాబాద్‌లో చేపట్టిన నేపథ్యంలో ఆ ప్రాంత బిడ్డలుగా ఎట్లా లీనమై పనిచేయాలె? దళితుల సామాజిక, ఆర్థికగౌరవాన్ని ఉన్నత శిఖరాల్లో నిలబెట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేయబోతున్న దళితబంధు పథక ఉద్దేశాలేంటి? ఈ పథకాన్ని ఎట్లా దళితుల్లోకి తీసుకపోవాలె? వారి జీవితాలను వారే అభివృద్ధి చేసుకునే దిశగా ఎట్లా వారికి అవగాహన కల్పించాలె? అధికారులతో ఎట్లా సమన్వయం చేసుకోవాలె? వంటి అంశాలపై స్వయంగా సీఎం కేసీఆర్‌ చర్చించి, దిశానిర్దేశం చేయనున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat