తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త రేషన్కార్డులను ఎమ్మెల్యే శంకర్ నాయక్ లబ్ధిదారులకు అందజేశారు. గూడూరు మండలంలోని వాసవీ ఫంక్షన్ హాలులో 558 కుటుంబాలకు మంగళవారం కార్డులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క వ్యక్తి కూడా పస్తులుండొద్దని, ఇదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సాధించిన గొప్ప సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సుజాత, జడ్పీటీసీ సుచిత్ర, చల్లా లింగారెడ్డి, భరత్ కుమార్ రెడ్డి, వెంకట్ కృష్ణారెడ్డి, రహీం, సురేందర్, వెంకన్న, అధికారులు, నేతలు పాల్గొన్నారు.