టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్లో ఇండియన్ బాక్సర్ లవ్లీనా బోర్గొహైన్( Lovlina Borgohain ) సంచలనాలకు తెరపడింది. బుధవారం 64-69 కేజీల విభాగంలో జరిగిన సెమీఫైనల్లో టర్కీ బాక్సర్ బుసెనాజ్ సూర్మనెలి చేతిలో 0-5తో ఆమె ఓడిపోయింది.
మూడు రౌండ్లలోనూ టర్కీ బాక్సర్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. దీంతో ఐదుగురు జడ్జీలు ఏకగ్రీవంగా ఆమెనే విజేతగా తేల్చారు. ఈ ఓటమితో లవ్లీనా బ్రాంజ్ మెడల్తో సరిపెట్టుకుంది. ఒలింపిక్స్ బాక్సింగ్లో ఇండియాకు వచ్చిన మూడో మెడల్ ఇది.
గతంలో విజేందర్, మేరీకోమ్ కూడా బ్రాంజ్ మెడల్స్ గెలిచారు. ఈ టోక్యో ఒలింపిక్స్లో ఇండియా గెలిచిన మూడో మెడల్ ఇది. వెయిట్లిఫ్టింగ్లో మీరాబాయి చాను సిల్వర్, బ్యాడ్మింటన్లో సింధు బ్రాంజ్ మెడల్ గెలవగా.. ఇప్పుడు బాక్సింగ్లో లవ్లీనా బోర్గోహైన్ మరో బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చింది.