Home / MOVIES / ‘సర్కారు వారి పాట’ తర్వాత మహేష్ నటించే చిత్రాలు ఇవే

‘సర్కారు వారి పాట’ తర్వాత మహేష్ నటించే చిత్రాలు ఇవే

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు పుట్టిన‌రోజు(ఆగస్ట్ 09) సందర్భంగా.. ‘సర్కారు వారి పాట’ తర్వాత ఆయన చేయబోతున్న చిత్ర వివరాలతో ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది.

ఈ వీడియోలో ఈ సినిమాకు ఎడిటింగ్, మ్యూజిక్, కెమెరా, ఆర్ట్ బాధ్యతలను ఎవరు నిర్వర్తించబోతున్నారు? అనే వివరాలతో పాటు.. సూపర్ స్టార్ సరసన నటించే హీరోయిన్‌ పేరు కూడా రివీల్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ‌(చిన‌బాబు) నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం మ‌హేష్-త్రివిక్ర‌మ్‌ల హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కబోతోంది.

ప్రచార చిత్ర వివరాల్లోకి వస్తే.. జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా ఈ చిత్రానికి ఎంపిక అయ్యారు. అలాగే కళా దర్శకునిగా అశోక్, ఛాయాగ్రాహకుడిగా ‘మధీ’, సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇక సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు సరసన మరోసారి పూజాహెగ్డే జతకట్టబోతోంది.

ఇంతకు ముందు మహేష్ నటించిన ‘మహర్షి’ చిత్రంలో పూజా హెగ్డేనే హీరోయిన్. అలాగే త్రివిక్రమ్‌తో పూజా హెగ్డేకి ఇది హ్యాట్రిక్ మూవీ. అంతకుముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాలలో పూజా హెగ్డే నటించింది. కాగా, ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, చిత్ర షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? వంటి వివరాలు త్వరలో మరో ప్రకటనలో తెలియజేస్తామని చిత్ర నిర్మాత తెలిపారు. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat