తమిళ హీరో ఆర్య తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని శ్రీలంక యువతి ఆర్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో చెన్నెలో కమిషనర్ ఎదుట ఆర్య మంగళవారం ఉదయం విచారణకు హాజరయ్యారు.
దీనిపై పోలీసులు ఆరా తీశారు. విషయానికొస్తే… శ్రీలంకకు చెందిన విద్జా జర్మనీలో ఉంటోంది. ఆర్య తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రూ.70 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆమె జర్మనీలో ఉండే ఆన్లైన్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆర్యతో చేసిన చాటింగ్ను స్ర్కీన్షాట్గా తీసి విడుదల చేసింది. ఈ మేరకు ఆర్యను మూడు గంటల సేపు పోలీసులు విచారించారు. ప్రస్తుతం కోర్టులో ఉన్న ఈ కేసు విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసుపై మరిన్ని విషయాలు తెలుసుకోవాలసిందిగా కోర్టు పోలీసులను ఆదేశించింది.