విప్లవాత్మక దళిత బంధు పథకాన్ని ప్రారంభించేందుకు ఈ నెల 16న హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించనున్న సభను విజయవంతం చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. సభకు 1.20లక్షల మంది హాజరుకానున్నట్టు పేర్కొన్నారు. మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్తో కలిసి సభా ఏర్పాట్లను పరిశీలించారు.
అధికారులతో సమీక్షించారు. దేశ చరిత్రలోనే గొప్ప పథకాన్ని ప్రారంభించేందుకు వస్తున్న సీఎం కేసీఆర్కు ఘనస్వాగతం పలికేందుకు.. సభను దిగ్విజయం చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. దళితులు హాజరయ్యేందుకు 825 బస్సులు సిద్ధం చేశామని, అలాగే వారికి మంచినీళ్లు, భోజన వసతి కూడా కల్పిస్తున్నామని వివరించారు.
ఈ సభలో రెండు వేల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున చెకులు అందజేస్తామని, ఆ మరుసటి రోజు నుంచి నియోజకవర్గంలోని అర్హత ఉన్న అన్ని కుటుంబాలకు అందిస్తామని వివరించారు. ఇందుకు సంబంధించి సీఎం రూ.2వేల కోట్లు ప్రకటించారని, రూ.500కోట్ల విడుదల చేశారని గుర్తు చేశారు. ఉద్యోగులకు తప్ప దాదాపు అన్ని కుటుంబాలకు అందిస్తామని చెప్పారు.