‘క్రేజీ అంకుల్స్’ మూవీ నుంచి తాజాగా ‘అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి’ అంటూ సాగే లిరికల్ సాంగ్ రిలీజైంది. యాంకర్ కం నటి శ్రీముఖి ప్రధాన పాత్రలో ఈ సినిమాను ఇ. సత్తి బాబు తెరకెక్కించారు.
ఇందులో క్రేజీ అంకుల్స్గా రాజా రవీంద్ర, సింగర్ మనో, భరణి నటించారు. ఈ చిత్రం ఆగస్టు 19న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో చిత్రం ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్, పాటలతో సినిమాపై ఆసక్తి బాగానే పెరిగింది.
ఈ క్రమంలోనే తాజాగా ‘క్రేజీ అంకుల్స్’ మూవీలోని ‘అనుకున్నదొక్కటి అయినది ఒక్కటీ’ అనే ఫన్నీ సాంగ్ రిలీజై ఆకట్టుకుంటోంది. ఆనంద్ గుర్రం సాహిత్యం అందించగా, భోలే శవాలి పాడటంతో పాటు సంగీతం అందించాడు. కాగా ఈ సినిమాకి శ్రీముఖి గ్లామర్ అదనపు ఆకర్షణగా నిలవనుందట. చూడాలి మరి ఈ క్రేజీ అంకుల్స్ ఏ మేరకు ఆకట్టుకుంటారో.