Home / NATIONAL / దేశంలో కొత్తగా 36,401 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 36,401 కరోనా కేసులు

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 36,401 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. తాజాగా 39,157 మంది బాధితులు కోలుకున్నారు. 24 గంటల్లో 530 మంది బాధితులు మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,23,22,258కు పెరిగింది.

ఇందులో 3,15,25,800 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 3,64,129 ఉన్నాయని చెప్పింది. వైరస్‌ బారినపడి ఇప్పటి వరకు 4,33,049 మంది కన్నుమూశారు.టీకా డ్రైవ్‌లో 56.64కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు మంత్రిత్వ శాఖ చెప్పింది.

జాతీయ రికవరీ రేటు 97.53 శాతానికి పెరిగిందని, రోజువారి పాజిటివిటీ రేటు 1.94శాతంగా ఉందని చెప్పింది. మరో వైపు దేశంలో కొవిడ్‌ పరీక్షలు 50కోట్ల మార్క్‌ను దాటాయి. బుధవారం దేశవ్యాప్తంగా 18,73,757 కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించగా.. ఇప్పటి వరకు 50,03,00,840 నమూనాలను పరిశీలించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) వివరించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat