Home / NATIONAL / దేశంలో కరోనా విజృంభణ

దేశంలో కరోనా విజృంభణ

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. నిన్న 25వేలకు చేరిన పాజిటివ్‌ కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. మరో వైపు మరణాలు సైతం 600కుపైగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 37,593 కొత్త కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.

తాజాగా 34,169 మంది బాధితులు కొలుకొని డిశ్చార్జి అయ్యారు. మహమ్మారి బారినపడి 24 గంటల్లో 648 మంది బాధితులు మృత్యువాతపడ్డారు. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.99 శాతం ఉన్నాయని, ప్రస్తుతం దేశంలో 3,22,327 యాక్టివ్‌ కేసులున్నాయి.

తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,25,12,366కు పెరగ్గా.. ఇందులో 3,17,54,281 మంది కోలుకున్నారు. వైరస్‌ బారినపడి 4,35,758 మంది మృత్యువాతపడ్డారు.

ప్రస్తుతం రికవరీ రేటు 97.67శాతానికి పెరిగిందని వివరించింది. ఇప్పటివరకు 59.55కోట్లకుపైగా మోతాదులు వేసినట్లు మంత్రిత్వ శాఖ చెప్పింది. ఇదిలా ఉండగా నిన్న ఒకే రోజు 17,92,755 నమూనాలను పరిశీలించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ పేర్కొంది. ఇప్పటి వరకు 51,11,84,547 నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat