Home / NATIONAL / దేశంలో కొత్తగా 30,941 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 30,941 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. మంగళవారం 30,941 కేసులు నమోదవగా తాజాగా 41 వేలకుపైగా మంది వైరస్‌ బారినపడ్డారు. ఇది నిన్నటికంటే 35.6 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

దేశవ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 41,965 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,28,10,845కు చేరింది. ఇందులో 3,19,93,644 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు.

మరో 3,78,181 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 4,39,020 మంది మహమ్మారి వల్ల మృతిచెందారని వెల్లడించింది. కాగా, మంగళవారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 460 మంది బాధితులు మరణింగా, 33,964 మంది కోలుకున్నారని తెలిపింది. ఒక్క కేరళలోనే 30,203 కేసులు నమోదవగా, 115 మంది మృతిచెందారు.దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. గత 24 గంటల్లో 1,33,18,718 మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేశామని వెల్లడించింది. దీంతో మొత్తం 65,41,13,508 డోసులను పంపిణీ చేశామని తెలిపింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat