తన స్పిన్ మాయాజాలంతో ఇండియాకు ఎన్నో విజయాలు అందించిన భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ హీరోగా ‘ఫ్రెండ్ షిప్’ అనే సినిమా రూపొందుతోంది. తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ అయింది.
తమిళ ‘బిగ్ బాస్’ ఫేమ్ లోస్లియా మరియనేసన్ హీరోయిన్గా, సీనియర్ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి జాన్ పాల్ రాజ్ – శ్యామ్ సూర్య దర్శకత్వం వహించారు. పాన్ ఇండియన్ సినిమాగా తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ మూవీని విడుదల చేయనున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ను కింగ్ అక్కినేని నాగార్జున రిలీజ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సీన్ టొవా స్టూడియోస్ – సినీ మాస్ స్టూడియోస్ బ్యానర్స్పై జేపీఆర్ – స్టాలిన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ‘ఫ్రెండ్ షిప్’ మూవీ కరోనా వేవ్స్ కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు పరిస్థితులన్నీ కాస్త అదుపులోకి రావడంతో త్వరలో రిలీజ్ డేట్ను అనౌన్స్ చేయనున్నారు.