ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంచాయతీరాజ్ శాఖ రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని, రానున్న మూడు రోజుల్లోగా కొత్త రోడ్లకు ప్రతిపాదనలు పంపించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖలోని పలు అంశాలపై హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. యుద్ధ ప్రాతిపదికన వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఇప్పటికే మంజూరైన పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు. అలాగే కొత్త రోడ్ల కోసం ప్రతిపాదనలను మూడు రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా ప్రజాప్రతినిధులతో మాట్లాడి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు.