మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నిన్న రాత్రి బైక్పై ప్రయాణిస్తున్న క్రమంలో కేబుల్ బ్రిడ్జి దగ్గర కింద పడి తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే. ముందుగా ప్రాథమిక చికిత్స కోసం మెడికోవర్ ఆసుపత్రికి తరలించగా, అనంతరం అపోలో ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. తాజగా అపోలో టీం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
సాయి తేజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. తీవ్ర స్థాయి గాయాలు కీలక ప్రాంతాల్లో తగలేకపోవడం వలన ఏ అవయవం కూడా దెబ్బ తినలేదు అని తెలిపారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. మిగతా మెడికల్ అప్డేట్ ని రేపు పొందుపరుస్తామని కన్ఫర్మ్ చేశారు.