విక్టరీ వెంకటేశ్ మరో తమిళ హిట్ రీమేక్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తాజా సమాచారం. ఇటీవల ‘అసురన్’ రీమేక్గా రూపొందిన ‘నారప్ప’ మూవీతో వచ్చి మంచి హిట్ అందుకున్నారు. అలాగే మలయాళ హిట్ సినిమా సీక్వెల్ ‘దృశ్యం 2’ సినిమాతో వచ్చేందుకు సిద్దమవుతున్న వెంకీ.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2’ సీక్వెల్గా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ ‘ఎఫ్3’లో నటిస్తున్నారు.
ఈ క్రమంలోనే 2015లో వచ్చిన తమిళ సూపర్ హిట్ సినిమా ‘ఎన్నై అరిందాల్’ రీమేక్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అజిత్ హీరోగా నటించిన ‘ఎన్నై అరిందాల్’ తెలుగులో ‘ఎంతవాడుగానీ’ పేరుతో డబ్ అయ్యి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
ఇప్పుడు ఇదే చిత్ర రీమేక్లో వెంకీ నటించబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియంటే మేకర్స్ నుంచి అధికారక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.