తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉత్తేజ్ భార్య క్యాన్సర్తో కన్నుమూసింది. అంతలోనే టాలీవుడ్లో మరో చేదు వార్త వినాల్సి వచ్చింది. టాలీవుడ్ అగ్ర సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఇంట్లో వరుస విషాదాలు జరిగాయి. డీఎస్పీ బాబాయి బుల్గానిన్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
ఈ విషాదం నుంచి కోలుకోకముందే మరో దారుణం జరిగింది. బుల్గానిన్ మరణవార్త తెలిసి ఆయన మేనత్త సీతామహాలక్ష్మి గుండెపోటుతో మరణించింది. ఈ విషయం తెలిసి కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాక్లోకి వెళ్లిపోయారు. కొద్ది గంటల వ్యవధిలోనే ఇద్దరి మరణవార్తలు డీఎస్పీ కుటుంబాన్ని పూర్తిగా కుంగదీశాయి. దేవిశ్రీ ప్రసాద్ ఇంట్లో ఈ జంట మరణవార్తల గురించి తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు దేవి శ్రీ ప్రసాద్. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప, రవితేజ కిలాడీ, దిల్ రాజు రౌడీ బాయ్స్, పవన్ కళ్యాణ్ భవదీయుడు భగత్ సింగ్.. చిరంజీవి బాబు సినిమాతో పాటు మరిన్ని సినిమాలకు కూడా సంగీతం అందిస్తున్నాడు దేవి శ్రీ ప్రసాద్. ఈయన కుటుంబంలో వరుస మరణాల గురించి తెలుసుకొని అందరూ చలించిపోతున్నారు. ధైర్యంగా ఉండాలి అంటూ అందరూ దేవిశ్రీ ప్రసాద్ను ఫోన్లో పరామర్శిస్తున్నారు.