సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు, వచ్చే ఏడాది నుంచి మద్యం దుకాణాల్లో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది.
దళితబంధు అమలులో భాగంగా వైన్స్ దుకాణాల్లో కూడా దళితులకు రిజర్వేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ఎస్సీలతోపాటు.. గౌడ కులస్థులు, ఎస్టీలకు కూడా రిజర్వేషన్ కల్పిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది.
ధరణి పోర్టల్లో తలెత్తుతున్న సమస్యల పరిష్కారానికి ఆర్థిక మంత్రి హరీశ్రావు నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. పోడు సమస్యలు, కొత్త జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లలో సమస్యల పరిష్కారానికి మరో రెండు ఉపసంఘాలను ఏర్పాటుచేసింది.