హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో బాగంగా జమ్మికుంట పట్టణం 14 వ వార్డులో స్థానిక కౌన్సిలర్ బోగం సుగుణ వెంకటేశ్ తో కలిసి ఆబాది జమ్మికుంటలో ఎమ్మెల్యే,జమ్మికుంట పట్టణ ఇంచార్జ్ నన్నపునేని నరేందర్ విస్తృత ప్రచారం నిర్వహించారు..వార్డులోని వీది వీది కలియదిరుగుతూ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించాలని ప్రజలను కోరారు..
వార్డులోని ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే కు వివరించారు..వెంటనే సంబందిత అదికారులతో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు..పలువురు అనారోగ్య సమస్యలతో ఉన్నవారికి ఆర్థిక సాయం అందజేసారు..ఆసుపత్రిలో మాట్లాడి మెరుగైన వైద్యం అందే దిశగా కృషి చేస్తామన్నారు..పలు వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు..
టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వానికి మద్దతు తెలపాలని కోరారు..టీఆర్ఎస్ చేపడుతున్న సంక్షేమాభివృద్ది కార్యక్రమాలు బాగున్నాయని టీఆర్ఎస్ కే తమ ఓటు అని వార్డు ప్రజలు ఎమ్మెల్యేతో అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,ఇంచార్జులు,యువజన నాయకులు,కార్యకర్తలు,మహిళలు పాల్గొన్నారు..