తమిళనాడు మాజీ కెప్టెన్ ఎస్ శరత్ బీసీసీఐ జూనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్గా ఎంపికయ్యాడు. దేశవాళీ సీజన్ ప్రారంభానికి వారం రోజుల ముందు బోర్డు శుక్రవారం జూనియర్ సెలెక్షన్ కమిటీని ఎంపిక చేసింది.
ఐదుగురు సభ్యుల కమిటీకి శరత్ (సౌత్ జోన్) చైర్మన్గా వ్యవహరించనుండగా.. కిషన్ మోమన్ (నార్త్ జోన్), రణదేవ్ బోస్ (ఈస్ట్ జోన్), పతీక్ పటేల్ (వెస్ట్ జోన్), హర్విందర్సింగ్ సోధి (సెంట్రల్) ఒక్కో జోన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
‘తమిళనాడు మాజీ కెప్టెన్ శరత్ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తాడు’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా ఒక ప్రకటనలో తెలిపాడు. తమిళనాడు తరఫున 100 రంజీ మ్యాచ్లు ఆడిన తొలి ప్లేయర్గా రికార్డులకెక్కిన శరత్.. గతంలో బీసీసీఐ మ్యాచ్ రిఫరీగాను బాధ్యతలు నిర్వర్తించాడు.