బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఇంట్లో వరుసగా మూడు రోజుల పాటు ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. అయితే నటుడు సోనూ సూద్ సుమారు 20 కోట్ల మేర ఆదాయపన్నును ఎగవేసినట్లు ఇవాళ ఆ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
సోనూ సూద్కు చెందిన నాన్ ప్రాఫిట్ సంస్థ ఫారిన్ కాంట్రిబ్యూషన్ చట్టాన్ని ఉల్లంఘించి సుమారు 2.1 కోట్లు సమీకరించినట్లు ఐటీశాఖ చెప్పింది. నటుడికి సంబంధించిన ఇండ్లు, అతని అసోసియేట్స్ ఇండ్లు, ఆఫీసుల్లో నిర్వహించిన తనికీలు పన్ను ఎగవేతకు చెందిన అనేక పత్రాలు దొరికినట్లు ఐటీశాఖ తెలిపింది.
కరోనా మహమ్మారి వేళ హీరో సోనూ సూద్ తన విరాళాలతో ప్రశంసలు పొందిన విషయం తెలిసిందే. సోనూ సూద్ చారిటీ ఫౌండేషన్ సంస్థను గత ఏడాది జూలైలో ప్రారంభించారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఆ సంస్థ 20 కోట్లు విరాళాల రూపంలో సేకరించినట్లు తెలుస్తోంది. దీంట్లో ఇప్పటి వరకు 1.9 కోట్లను ఖర్చు చేశారు. మరో 17 కోట్లు ఆ సంస్థ బ్యాంక్ అకౌంట్లోనే ఉన్నాయి.