దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా మరింతగా తగ్గింది. కొత్తగా 30 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గతంలో 25 వేలకు పడిపోయిన కరోనా పాజిటివ్ కేసులు రెండు రోజులపాటు పెరిగి, 35 వేలకు పైగా చేరుకున్నాయి. తాజాగా కరోనా కేసులు నమోదులో క్షీణత కనిపించింది.
తాజాగా 31 వేలకు దిగువగా కరోనా కేసులు నమోదయ్యాయి. థర్డ్వేవ్ ముప్పు తప్పదంటూ వైద్య నిపుణులు సూచిస్తున్న ప్రస్తుత తరుణంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టడం ఊరట కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 30,773 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇదే సమయంలో 309 మంది కరోనా కారణంగా మృతి చెందారు. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 38,945 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,34,48,163. వీరిలో 3,26,71,167 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ 4,44,838 మంది కన్నుమూశారు. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3,32,158గా ఉంది.