Home / MOVIES / ప్ర‌భుదేవా సంచలన నిర్ణయం

ప్ర‌భుదేవా సంచలన నిర్ణయం

న‌టుడిగా, కొరియోగ్రాఫ‌ర్‌గా, ద‌ర్శ‌కుడిగా స‌త్తా చాటిన ప్ర‌భుదేవా.. తెలుగు, త‌మిళం, హిందీ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించారు. ఇండియ‌న్ మైకేల్ జాన్స‌న్‌గా పేరొందిన ఆయ‌న తెలుగులో ఎమ్మెస్ రాజు బ్యానర్లో రెండు సినిమాలు చేశారు. ఇక ఇక్క‌డి సినిమాల‌ను హిందీలో రీమేక్ చేసి మంచి విజ‌యం అందుకున్నారు.

కొన్నాళ్లుగా ప్ర‌భుదేవాకి పెద్ద‌గా స‌క్సెస్‌లు రావ‌డం లేదు. సల్మాన్ ఖాన్‌తో చివరగా చేసిన రాధే సినిమా అభిమానులను దారుణంగా నిరాశపరిచింది. దాంతో ప్రభుదేవా తిరిగి చెన్నైకు చేరుకున్నారు. ఇకపై డైరెక్షన్ చేయకూడదని నిర్ణయించుకున్న ఆయన.. నటన పైనే పూర్తి దృష్టి పెట్టాడని చెబుతున్నారు.

నటుడిగా వరుస అవకాశాలు వస్తున్న కారణంగానే ఆయన ఈ నిర్ణయానికి వచ్చాడని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన భగీరా అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు తమిళ్ భాషల్లో విడుదల కానుంది.కాగా, ప్రభుదేవా దర్శకుడిగా మారిన తర్వాత కొరియోగ్రాఫర్‌గా ఒకరిద్దరు హీరోలకు మాత్రమే డాన్స్ కొరియోగ్రఫీ చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat