Home / NATIONAL / దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

పార్లమెంటులో ఖాళీగా ఉన్న మూడు లోక్‌సభ స్థానాలకు వచ్చే నెలలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. వీటితోపాటు దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 30 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉపఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది.

ఈ మేరకు మంగళవారం నాడు ఎన్నికల కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఎన్నికల లెక్కింపు నవంబరు 2న జరగనుంది.కరోనా మహమ్మారి సహా పండుగలు, వరదలు, చలి వంటి అన్ని అంశాలనూ ఎలక్షన్ కమిషన్ పరిశీలించిందని ప్రకటనలో తెలిపింది. ఈ విషయాల్లో ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించినట్లు చెప్పింది.

ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే దాద్రా నగర్ హవేలి, డామన్ అండ్ డయ్యూ, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాల్లోని మూడు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఈసీ స్పష్టంచేసింది. వీటితోపాటు వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 30 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat