ఇది వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. హుజురాబాద్ నియోజకవర్గంలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు టీఆర్ఎస్ పార్టీకే పట్టం కడుతున్నారు. వచ్చే నెలలో జరగబోయే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగుతున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ తరపున ఆ పార్టీ శ్రేణులు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం నియోజకవర్గంలోని ప్రతోక్కర్ని ఆలోచింపజేస్తుంది.
రెండు దశాబ్ధాలుగా హుజురాబాద్ నియోజకవర్గంలో అధికారాన్ని.. హోదాను అడ్డుపెట్టుకుని ఈటల రాజేందర్ చేసిన అనేక అక్రమాలు.. భూకుంభకోణాలు ఒకొకటి వెలుగులోకి రావడంతో అప్పటివరకు ఈటల రాజేందర్ పై ఉన్న అభిమానం. ఆదరణ అన్ని గాలికి కొట్టిపోయినట్లైంది. ఈటల రాజేందర్ చేసిన అనేక అక్రమాలు.. భూకుంభకోణాలపై గులాబీ శ్రేణులు నిర్వహించిన ప్రచారం హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు తమకు మంచి చేసింది ఎవరు.. తమను అడ్డుపెట్టుకుని అక్రమాస్తులు సంపాదించుకుంది ఎవరు అనేది క్లారిటీగా ఆర్ధమైంది.
గత కొన్ని నెలలుగా మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు పట్ల నమ్మకాన్ని పెంచాయి. ఒకవైపు ఈటల రాజేందర్ చేసిన అక్రమాలపై వివరిస్తూ.. మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఎంతో సత్పలితానిచ్చాయి.ఈటల రాజేందర్ పై ఉన్న తీవ్ర వ్యతిరేకత పీక్ స్టేజ్ కు చేరుకుంది. ఎన్నికల్లో గెలవడానికి ఈటల రాజేందర్ చేసిన కుట్టుమిషన్లు,బొట్టు బిళ్లల పంపిణీ లాంటి అనేక కార్యక్రమాలు తన పట్ల ప్రజలకున్న సానుభూతిని కూడా పోగొట్టాయనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు..
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్ఎస్ అధినేత ,సీఎం కేసీఆర్ మార్గదర్శకంలో మంత్రి తన్నీరు హారీష్ రావు నేతృత్వంలోని గులాబీ శ్రేణులు అనుసరించిన పక్కా వ్యూహ రచనలు.. చేస్తున్న ప్రచారం అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపుకు దోహదపడనున్నాయి.