కొద్ది రోజుల క్రితం మణికొండలోని ఓ డ్రైనేజీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ రజనీకాంత్ కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఇవాళ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్ రజనీకాంత్ మృతి పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలుపుతూ.. ఆయన కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
రజనీకాంత్ మృతి చెందిన ఘటనకు సంబంధించి ఇప్పటికే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించామన్నారు. తమ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్లే ఆ ఘటన జరిగిందన్నారు. ఇందుకు మంత్రిగా తాను బాధ్యత వహిస్తున్నాను. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. కుంభవృష్టిని తట్టుకునేలా మున్ముందు చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.