పాముకు ఎంతటి స్వచ్ఛమైన పాలు పొసి పెంచిన చివరికి అది కాటేస్తే వచ్చేది విషమే తప్పా పాలు కాదు అన్నట్లు అధికారం కోసం.. స్వార్ధం కోసం ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కొనే సంస్కారం ఉన్న అనుముల రేవంత్ రెడ్డిని నమ్మితే పార్టీ ఆగమవ్వడం తప్పా బాగుపడటం ఉండదని వాపోతున్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు.. టీపీసీసీ చీఫ్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనుముల రేవంత్ రెడ్డి తమ పార్టీని బలోపేతం చేయకుండా ప్రత్యర్థి పార్టీ అయిన బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ కోసం పని చేస్తున్నాడని వాపోతున్నారు..
కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు అలా బాధపడటంలో వాస్తవం లేకపోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీనే టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణను ఇచ్చిన పార్టీ అయిన కాంగ్రెస్ ను తెలంగాణ సమాజం తప్పకుండా దీవిస్తుందని చెప్పుకోస్తున్న ఆ పార్టీ శ్రేణులకు టీపీసీసీ చీఫ్ గా ఉండి అనుముల రేవంత్ రెడ్డి వాళ్ళకు దిమ్మతిరిగే షాకిస్తున్నాడు. హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ రాజీనామా చేసిన కొన్ని రోజులకే అనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుపును ఎవరు ఆపలేరు. ఈ ఉప ఎన్నికల్లో ఈటల గెలవడం ఖాయం “అని అప్పట్లో చేసిన సంచలన వ్యాఖ్యలతో కాంగ్రెస్ శ్రేణులు అయోమయంలో పడ్డారు.
తాజాగా అధికార పార్టీ తరపున బరిలోకి దిగుతున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ తరపున బరిలోకి దిగుతారని భావిస్తున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ తమను గెలిపించాలని హుజురాబాద్ నియోజకవర్గంలో తమ తమ శైలీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే తామే ప్రత్యామ్నాయం.. వచ్చే ఎన్నికల్లో మేమే అధికారం చేపడతాం అని బీరాలు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ తరపున మాత్రం ఇంతవరకు కనీసం అభ్యర్థి పేర్లను కూడా నామమాత్రంగా అయిన చెప్పలేదు. దీంతో అనుముల రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్ కు అమ్ముడుపోయారు. ఒక మాజీ ఎంపీ ద్వారా ఈ భారీ మొత్తాన్ని ఈటల రాజేందర్ అనుముల రేవంత్ రెడ్డికి అప్పజేప్పారు.
అందుకే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టలేదు అని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్ తరపున అభ్యర్థిని నిలబెట్టాల్సి వస్తే ఈటల గెలుపుకు సహకరించే విధంగా డమ్మీ అభ్యర్థిని రేవంత్ రెడ్డి నిలబెడతాడని ఆ పార్టీలోని నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇది అంతా టీఆర్ఎస్ పార్టీని ఓడించాలనే బలమైన కారణంతో అనుముల రేవంత్ రెడ్డి ఈ కుట్రలకు తెరతీశారని రాజకీయ వర్గాల్లో విన్పిస్తున్న టాక్ …