సేంద్రీయ సాగుపై మండలిలో సభ్యుల ప్రశ్నకు మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానానికి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ఫిదా అయ్యారు. సబ్జెక్టు మీద సంపూర్ణ అవగాహనతో ఇచ్చిన సమాధానం ఎంతో బాగుందని, క్షేత్రస్థాయిలో సేంద్రీయ సాగుపై రైతులను ప్రోత్సహించేందుకు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు అవగాహన తరగతులు చేపట్టాలని సూచించారు.
ప్రస్తుత, భవిష్యత్ సమాజ అవసరాల దృష్ట్యా అందరూ బాధ్యతగా సేంద్రీయ సాగును ప్రోత్సహించాలని అన్నారు.మీరు ఇంత చక్కగా చెప్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యే పరిధిలో నాలుగైదు రైతు వేదికలు ఉన్నాయి. ఒక రోజు ఒక ఎమ్మెల్యేకు సమయం ఇచ్చి.. ఈ ఐదు వేదికలను ఒకచోట చేర్చాలి.
మీ భాష సామాన్య రైతుకు అర్థమయ్యేలా ఉంది. మీరు సేంద్రీయ సాగుపై రైతులకు విడమరిచి చెప్పాలి. తప్పకుండా మీకు పెద్ద పేరు వస్తది. దాని కన్నా పెద్ద సేవ చేసినవాళ్లు అవుతారు. మీరు ఇక్రిశాట్ విజిట్ చేస్తారని తెలిసింది. మా మిత్రులు అడిగారు.. ఇక్రిశాట్ విజిట్ చేసినప్పుడు మా వాళ్లందరినీ తీసుకొని వెళ్లాలి అని భూపాల్ రెడ్డి కోరారు. ఇందుకు మంత్రి నిరంజన్ రెడ్డి అంగీకరించారు.