Home / MOVIES / “నేను నీ దాన్ని.. నీవు నా వాడివి” అంటూ చైతూపై సమంత Post Viral

“నేను నీ దాన్ని.. నీవు నా వాడివి” అంటూ చైతూపై సమంత Post Viral

“నేను నీ దాన్ని.. నీవు నా వాడివి” అంటూ సమంత తన ఇన్స్టాగ్రాం అకౌంట్‌లో షేర్ చేసిన ఓ పాత  పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. సమంత-నాగచైతన్య క్యూట్ కపుల్‌గా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. అంతేకాదు సినీ వర్గాలు, అభిమానులు చూడముచ్చటైన జంట అని చెప్పుకున్నారు. టాలీవుడ్‌లో మోస్ట్‌ బ్యూటి్‌ఫుల్, రొమాంటిక్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు చై-సామ్‌. దాదాపు పదేళ్ల పరిచయం.

ఏడేళ్ల ప్రేమలో ఆనందంగా గడిపి.. పెద్దలను ఒప్పించి..రెండు మత సాంప్రదాయాల ప్రకారం ఎంతో వైభవంగా పెళ్ళి చేసుకున్నారు. 2017 అక్టోబర్‌ 6-7 తేదీల్లో రెండు సంప్రదాయాల్లో సమంత – నాగ చైతన్యల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారిద్దరు కలిసుంటే గనక నేడు (అక్టోబర్‌7) నాలుగవ వివాహా వార్షికోత్సవం గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేవారు. 

కానీ ఇటీవలే (అక్టోబర్ 2) చై-సామ్‌లు విడిపోతున్నట్లు ప్రకటించారు.అయితే, సమంత ఏడాది క్రితం పెట్టుకున్న ఓ ఇన్‌స్టా పోస్ట్‌ మరో సారి వైరల్‌గా మారింది. అన్నీ సవ్యంగా ఉండి ఉంటే ఈ క్యూట్ కపుల్ నేడు మ్యారేజ్‌ డే జరుపుకునేవారు. ఈ నేపథ్యంలో గతేడాది పెళ్లి రోజు సందర్భంగా, సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో నాగ చైతన్యతో కలిసి ఉన్న ఫోటోను  షేర్‌ చేసి.. ‘‘నేను నీ దాన్ని.. నీవు నా వాడివి.. ఎలాంటి పరిస్థితులైనా రానీ.. మనిద్దరం కలసికట్టుగా వాటిని ఎదుర్కొందాం.. ఆహ్వానిద్దాం.. హ్యాపీ యానివర్సరీ హస్బెండ్‌’’ అని క్యాప్షన్‌తో పోస్ట్‌ చేశారు. సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat