దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం 15,823 కేసులు నమోదవగా, తాజాగా అవి 18 వేలు దాటాయి. ఇది నిన్నటికంటే 16 అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక యాక్టివ్ కేసులు 2.06 లక్షలకు తగ్గాయి. గత 215 రోజుల్లో యాక్టివ్ కేసులు 2 లక్షలకు తగ్గడం ఇదే మొదటిసారి.
దేశంలో కొత్తగా 18,987 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,40,20,730కు చేరింది. ఇందులో 3,33,62,709 మంది బాధితులు కోలుకోగా, 2,06,586 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 4,51,435 మంది మహమ్మారి వల్ల మృతిచెందారు.