Home / SLIDER / ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు…

ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని ఎంఎన్ రెడ్డి నగర్ లో దాతలు పొన్నాల కిష్టమ్మ వీరయ్య గారు (రూ.10 లక్షలు), ఎంఎన్ రెడ్డి నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు సందిరి గోవర్ధన్ రెడ్డి గారు (రూ.3.50 లక్షలు), ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు (రూ.2 లక్షలు), బిజెపి నేత భరత్ సింహా రెడ్డి గారు (రూ.1.70 లక్షలు) మరియు ఇతర దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన పొన్నాల కిష్టమ్మ వీరయ్య భవన్ (ఎంఎన్ రెడ్డి నగర్) కమ్యూనిటీ హాల్ ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రజలకు ఎంతో ఉపయోగపడే విధంగా సకల సదుపాయాలతో పూర్తయిన కమిటీ హాల్ ను నేడు ప్రారంభించడం ఎంతో సంతోషకరమన్నారు. ఇందులో భాగంగా కమిటీ హాల్ నిర్మాణానికి దాతలు సహకరించడం అభినందనీయమన్నారు. గతంలో ఎంఎన్ రెడ్డి నగర్ లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్యను పూర్తిగా అధిగమించి కాలనీలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా పని చేస్తున్నామని అన్నారు.

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గౌరవ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి సహకారంతో అభివృద్ధి పనులకు నిధుల కొరత లేకుండా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పనులు పూర్తి చేస్తున్నామన్నారు. కాలనీ వాసులంతా ఇదే ఐకమత్యంతో ఉంటూ ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారంలో ఎప్పుడూ ముందుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కుంట సిద్ధిరాములు, సంపత్ మాధవ రెడ్డి, గుమ్మడి మధుసుధన్ రాజు, మాధవ రెడ్డి, కనకయ్య, వేణు గోపాల్, విజయ్ హరీష్ మరియు కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు శంకర్, భరత్, శివరామి రెడ్డి, మోహన్ రావు, నాగేశ్వర రావు, సంజీవ రావు, రాము, చంద్రారెడ్డి, బాలబాబు, శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat